
- ఉమ్మడి జిల్లాలో భూభారతి పోర్టల్కు1,02,768 అప్లికేషన్లు
- పరిష్కారానికి అధికారుల కసరత్తు
యాదాద్రి, వెలుగు: చిన్న చిన్న భూ సమస్యలను సైతం ధరణి పోర్టల్ఏండ్ల తరబడి పరిష్కరించలేకపోయింది. ఏ స్థాయి ఆఫీసర్ను కలిసినా ఫలితం శూన్యం. దీంతో రైతులు, భూ యజమానులు ఇబ్బంది పడ్డారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం భూభారతిని అమలులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పైలట్ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా 73 మండలాల్లోని 1,168 గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో భూ సమస్యలపై 1,02,768 అప్లికేషన్లు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పోర్టల్కు రెగ్యులర్గా అప్లికేషన్లు
ఒకవైపు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను పరిశీలిస్తూనే మరోవైపు భూభారతి పోర్టల్ లో రెగ్యులర్గా వస్తున్న అప్లికేషన్లను ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్పరిశీలన అనంతరం ఆర్డీవో, అడిషనల్కలెక్టర్ (రెవెన్యూ) చూశాక కలెక్టర్వద్దకు చేరుతున్నాయి. కలెక్టర్పరిశీలన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.
14 మ్యాడ్యూల్స్లో 8,607 దరఖాస్తులు
ఉమ్మడి జిల్లా నుంచి 14 మ్యాడ్యూల్స్లో వివిధ సమస్యల కోసం భూభారతి పోర్టల్లో ప్రస్తుతం 8,607 అప్లికేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని పరిష్కరించారు. తహసీల్దార్ల వద్ద 5,774 అర్జీలు పరిశీలనలో ఉన్నాయి. ఆర్డీవోల వద్ద 1,331, అడిషనల్కలెక్టర్లవద్ద 548, కలెక్టర్ల వద్ద 1,266 దరఖాస్తులు ఉన్నాయి.
పాస్బుక్ సమస్యలు యాదాద్రిలోనే ఎక్కువ
భూభారతి పోర్టల్లో వచ్చిన అప్లికేషన్లలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డాటా కరెక్షన్ కు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, పెండింగ్మ్యూటేషన్లు, సక్సేషన్దరఖాస్తులు ఉన్నాయి. ఎన్ఆర్ఐలకు సంబంధించి పట్టాదారు పాస్బుక్సమస్యలు యాదాద్రి జిల్లాలోనే ఎక్కువ.